Revanth Reddy: నేడు మేడిగడ్డ బ్యారేజీకి మంత్రులతో రేవంత్‌ రెడ్డి!

సీఎం రేవంత్‌ తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు కాసేపట్లో వెళ్లనున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మేడిగడ్డకు రేవంత్ రెడ్డి బృందం చేరుకుంటుంది.

Revanth Reddy: నేడు మేడిగడ్డ బ్యారేజీకి మంత్రులతో రేవంత్‌ రెడ్డి!
New Update

Revanth Reddy To Visit Medigadda: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, శాసనసభ్యులు ఇవాళ(ఫిబ్రవరి 13) సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు బస్సుల్లో బయలుదేరుతారు. రేవంత్‌ పర్యటనకు అన్ని పార్టీల శాసనసభ్యులను ఆహ్వానించారు, అయితే ప్రతిపక్ష BRSతో పాటు BJP సైతం సీఎంతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేయకూడదని నిర్ణయించుకున్నాయి.

ఎన్నికల ముందు దుమారం:

మేడిగడ్డ బ్యారేజీకి చెందిన కొన్ని పైర్లు కొన్ని నెలల క్రితం మునిగిపోవడంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిజనిర్ధారణ బృందాన్ని పంపింది. ఈ ఘటన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. నవంబర్ 2న రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాళేశ్వరం కీలక అంశంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ పైర్ల పూడికతీతపై న్యాయ విచారణను ప్రకటించింది.

ఎన్నో ఆరోపణలు.. సమాధానాలేవి?

డిసెంబర్ 29న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు రాష్ట్ర మంత్రులు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. అక్టోబరు 21న పైరు మునిగిపోయినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, నీటిపారుదల శాఖ మంత్రి గానీ నష్టాన్ని సమీక్షించలేదని, ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శలు గుప్పించారు. అన్నారం బ్యారేజీలో కూడా పగుళ్లు ఏర్పడాయని, మూడో బ్యారేజీ సుందిళ్లలో ఇసుక కోతకు గురికావడం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ అధికారిక పర్యటనకు రావాల్సిందిగా గత వార రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రశేఖర్‌రావును ఆహ్వానించారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానించారు.

అసెంబ్లీకి డుమ్మా:

ఇక నిన్న అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ ఇచ్చి పవర్‌ పాయింట్ ప్రాజెంటేషన్‌ ఇచ్చింది. దీనికి కేసీఆర్‌ హాజరుకాలేదు. కీలకమైన అంశంపై చర్చకు కేసీఆర్ గైర్హాజరు కావడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి గైర్హాజరు కావడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనన్నారు. మరోవైపు ఇవాళ నల్గొండలో జరిగే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు కేసీఆర్ హాజరవనున్నారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. కృష్ణాపై ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి బేషరతుగా అప్పగించేందుకు తెలంగాణ సిద్ధంగా లేదని స్పష్టం చేస్తూ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది.

Also Read: మా పిల్లలను కుక్కలు, నక్కలుగా చూస్తున్నారు.. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆర్ఎస్పీ ఆందోళన

WATCH:

#kaleshwaram-lift-irrigation-project #congress #medigadda-barrage #revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe