CM Revanth Reddy: ఈసారి ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది-సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్‌లో వినియోగించుకున్నారు. దాని తర్వాత ఆయన మాట్లాడుతూ దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని చెప్పారు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తూ 400 సీట్లు వస్తాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

Telangana : తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌.. ఫొటో వైరల్
New Update

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొండగల్‌లో ఓటేసిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండమని చెప్పారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోంది..కానీ దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏ కు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది.. 400 సీట్లు ఎట్లా సాధ్యమని ప్రశ్నించారు.

సెప్టెంబర్ 17, 2025తో మోదీ 75 ఏళ్లు నిండుతాయి. ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలి. 13 ఏళ్లు సీఎంగా , 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ.. మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని అన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడంలేదు. దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారు. ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతోంటే... మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దార్ దీన్నిబట్టి తెలుస్తోందన్నారు. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని..దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మోదీ హయాంలో బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తోంది. మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవు. నవనీత్ కౌర్ 15సెకన్ల కామెంట్స్ పై చర్యలు లేవు..బీజేపీ నేతలపై ఎంహెచ్ఏ కంప్లైంట్ చేయదు. కానీ ఒక వీడియో వైరల్ కేసులో మాపై ఎంహెచ్ఏ రంగంలోకి దిగింది. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనమని అన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ వాషింగ్ మెషిన్ లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా?కాంగ్రెస్ కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ఒక్కటే అడుగుతున్నా.ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించండి అంటూ అడిగారు రేవంత్ రెడ్డి. మోదీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు..

ఇక తెలంగాణలో తమ పాలన గురించి మాట్లాడుతూ రైతు బంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం అని చెప్పారు ముఖ్యమంత్రి. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదు. పార్లమెంట్ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం. అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్ కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోంది..యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. కేసీఆర్ పై నాకు సానుభూతి ఉంది. మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Also Read:Hyderabad: పాతబస్తీ పోలింగ్ స్టేషన్‌లో మాధవీలత హల్ చల్

#telangana #elections #cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి