Kaleshwarm Project: తెలంగాణలో ఇప్పుడంతా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి(Kaleshwaram Corruption)పై బిగ్ డిస్కషన్ నడుస్తోంది. మీడియాలో, సోషల్ మీడియాలో, పొలిటికల్ పార్టీల్లో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మొదలు.. నిర్మాణం పూర్తి అయిన తరువాత కూడా ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల మేడిగడ్డ(Medigadda Barrage) బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడంతో ఈ ఆరోపణలు మరింత పీక్స్కు చేరాయి. అయితే, బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్(Congress) నేతలు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అప్పటి పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనేకసార్లు లేఖలు కూడా రాశారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Kaleshwarm Project: రూ. 50 వేల కోట్లు బొక్కిన మేఘా కృష్ణా రెడ్డి.. సీబీఐ విచారణ?
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 50 వేల కోట్ల కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి బొక్కేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రతిపక్షంలో ఉండి సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నిస్తున్నారు.
Translate this News: