తెలంగాణ బీజేపీ (Telangana BJP) అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది. అభ్యర్థుల జాబితాపై బీజేపీ అధిష్టానం కసరత్తు తీవ్రం చేసింది. ఆ జాబితాకు హైకమాండ్ తుది రూపు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఢిల్లీలో అమిత్ షాతో ఈ రోజు కీలక భేటీ అయ్యారు. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను కిషన్రెడ్డి అమిత్షాకు చూపించారు. నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో.. కేంద్ర ఎన్నికల కమిటీ బేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ జరిగే అవకాశం ఉంది. జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈనెల 6న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
పూర్తిగా చదవండి..Telangana BJP: ఈ నెల 6న బీజేపీ అభ్యర్థుల జాబితా.. ఆ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?
అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలెట్టిన బీజేపీ అధిష్టానం. ఈనెల 6న బీజేపీ అభ్యర్థుల జాబితా ఉన్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటనపై ఢిల్లీలో అమిత్షాతో కిషన్రెడ్డి భేటీ అయ్యారు. అమిత్షాతో అభ్యర్థుల ఎంపిక అంశం, పార్టీలో నెలకొన్న పరిస్థితిలు, మోదీ సభపై కిషన్రెడ్డి చర్చించారు. కొన్ని నియోజకవర్గాలకు పేర్లని బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు ఖరారు చేసినట్టు సమాచారం.
Translate this News: