ఆ విషయంలో సిద్దిపేట ఫస్ట్, గజ్వేల్ సెకండ్.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..

తెలంగాణలో విద్యుత్ బకాయిల్లో సిద్దిపేట టాప్‌లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండవ స్థానంలో గజ్వేల్, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై చర్చ హాట్ హాట్ జరిగింది.

ఆ విషయంలో సిద్దిపేట ఫస్ట్, గజ్వేల్ సెకండ్.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..
New Update

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ విద్యుత్ అంశంపై అధికార, విపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విద్యుత్‌పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వివరాలు ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు చెల్లించని వాటిలో సిద్ధిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ప్రాంతాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 61.37 శాతం బకాయిలతో సిద్దిపేట మొదటి స్థానంలో ఉంటే.. రెండో స్థానంలో గజ్వేల్ 50.29 శాతం విద్యుత్ బకాయిలు కలిగి ఉందన్నారు. మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ 43 శాతం బకాయిలు కలిగి ఉందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు.. సిద్దిపేటలో హరీష్ రావు, గజ్వేల్‌లో కేసీఆర్, హైదరాబాద్ సౌత్‌లో అక్బరుద్దీన్.. విద్యుత్ బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇక విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అసలు విద్యుత్ కోతలే లేనట్లుగా జగదీశ్ రెడ్డి మాట్లాడరని విమర్శించారు. తమ పాలనలో కరెంట్ కోసం రైతులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయా? అని జగదీష్ రెడ్డి చెప్పడంపై కౌంటర్ ఇచ్చారు సీఎం. కామారెడ్డిలో సెప్టెంబర్ 1వ తేదీన సబ్ స్టేషన్‌లను ముట్టడి చేసి రైతులు నిరసన తెలిపిన ఘటనను గుర్తు చేశారు సీఎం రేవంత్. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో రైతులు రోడ్డెక్కింది బీఆర్ఎస్ పాలనలోనే అని గుర్తు చేశారు. కరెంటు సరిగా లేక.. పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆరెస్ పాలనలోనే అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయి 9 మంది మరణించారని గుర్తు చేశారు సీఎం రేవంత్. ఈ ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకుందని చెప్పారు. కానీ, ఆనాటి సీఎం, విద్యుత్ శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు సీఎం. అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు ఏమాత్రం మంచిది కాదని హితవు చెప్పారు సీఎం రేవంత్. మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్త శుద్ధిని శంకించాల్సిన పనిలేదన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హాయం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసునని అన్నారు సీఎం రేవంత్. ఈ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దామని, ఇప్పుడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చిద్దామని పేర్కొన్నారు సీఎం.

Also Read:

పవన్‌కు అది అలవాటే.. మంత్రి అంబటి సెన్సేషనల్ కామెంట్స్..!

ఆ ఇద్దరిలో ఆత్రం ఎక్కువైంది.. సజ్జల షాకింగ్ కామెంట్..

#telangana-cm-revanth-reddy #hyderabad-news #telangana-news #telangana-assembly #gajwel-news #siddipet-news #white-paper-on-power
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe