Arattai App: వాట్సాప్‌కు పోటీగా ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్ అరట్టై.. ఫీచర్లు కుమ్మేశాయ్ భయ్యా..!

జోహో రూపొందించిన స్వదేశీ మెసేజింగ్ యాప్ 'అరట్టై'. ఇది టెక్స్ట్, వాయిస్ కాల్స్‌, వీడియో కాల్స్‌, గ్రూప్ చాట్‌లు, మీడియా షేరింగ్‌ను అందిస్తుంది. కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. డేటా ఇండియా సర్వర్‌లలో సురక్షితంగా ఉంటుంది.

New Update
India Messaging App Arattai Features

India Messaging App Arattai Features

ప్రపంచ వ్యాప్తంగా ‘వాట్సాప్’కు విశేష ఆదరణ ఉంది. కోట్లాది ప్రజలు మెసేజింగ్ యాప్‌ ‘వాట్సాప్‌’ను విపరీతంగా వాడుతున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీ కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూ వస్తోంది. అయితే ఈ వాట్సాప్ అనేది అమెరికా దేశానికి చెందిన కంపెనీ. దీనికి పోటీగా భారత్‌లో కూడా అలాంటి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ ‘టెలిగ్రాం’ పేరుతో తీసుకొచ్చారు. కానీ అది అంతగా ఆదరణ పొందలేదు. కానీ తాజాగా చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ (Zoho Corporation) వాట్సాప్‌కు పోటీగా ఒక కొత్త మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. 

దాని పేరు ‘అరట్టై’ (Arattai). తమిళంలో దీని అర్థం ‘మాట్లాడుకోవడం’ అని. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపులో భాగంగా.. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా కేంద్ర మంత్రుల మద్దతుతో ఇది ప్రారంభమైంది. ఈ Arratai  యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. దీనిని ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా నిలవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఈ మెసేజింగ్ యాప్ Arattai ఫీచర్ల గురించి తెలుసుకుందాం. 

Arattai Features

ప్రాథమిక కమ్యూనికేషన్: Arattaiలో టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ నోట్‌లు, ఆడియో, వీడియో కాల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

గ్రూప్ చాట్‌లు, ఛానెల్స్: ఈ Arattai యాప్ గరిష్టంగా 1,000 మంది సభ్యులతో గ్రూప్ చాట్‌లను క్రియేట్ చేసుకునేందుకు సపోర్ట్ చేస్తుంది. అలాగే అప్‌డేట్‌లు, వార్తలను ఇతరులకు షేర్ చేయడానికి ఛానెల్స్, స్టోరీస్ (WhatsApp స్టేటస్ తరహాలో) ఫీచర్లను అందించింది.

మీడియా షేరింగ్: యూజర్లు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు వంటి ఫైళ్లను షేర్ ఇందులో చేయవచ్చు. ఈ యాప్ తక్కువ బ్యాండ్‌విడ్త్ ఉన్న ప్రాంతాల్లోనూ వేగంగా పనిచేసేందుకు ఆప్టిమైజ్ చేయబడింది.

ప్రైవసీ, సెక్యూరిటీ: Arattai యూజర్ డేటాను భారతీయ సర్వర్‌లలో మాత్రమే స్టోర్ చేస్తుంది. మరీ ముఖ్యంగా యాప్ వాయిస్, వీడియో కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది. అయితే ప్రస్తుతం సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రం పూర్తి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సౌకర్యం లేదు. ఈ ఫీచర్‌ను త్వరలోనే తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు జోహో కంపెనీ తెలిపింది.

మల్టీ-డివైస్ సపోర్ట్: మొబైల్‌తో పాటు, డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ టీవీ వంటి వివిధ డివైజ్‌లలోనూ Arratai యాప్‌ను యూజ్ చేసుకోవచ్చు.

Special Features

Pocket: ఇది యూజర్లు తమ ముఖ్యమైన నోట్‌లు, మీడియా ఫైళ్లను స్టోర్ చేసుకునేందుకు వీలుగా ఉండే వ్యక్తిగత క్లౌడ్ స్టోరేజ్.

Meetings: ఈ Arratai యాప్‌లోనే వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్‌ను షెడ్యూల్ చేయడం, జాయిన్ కావడం వంటి సదుపాయం కూడా జోహో కంపెనీ కల్పించింది. 

వాట్సాప్‌తో పోలిస్తే.. Arratai మెసేజ్ ఎన్‌క్రిప్షన్ విషయంలో ఒక అడుగు వెనుకబడే ఉంది. అయినప్పటికీ ‘మేడ్ ఇన్ ఇండియా’ పేరు, యూజర్ డేటా ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలతో భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీని డౌన్‌లోడ్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జోహో సీఈఓ శ్రీధర్ వెంబు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ యాప్ ట్రాఫిక్ కేవలం మూడు రోజుల్లోనే 100 రెట్లు పెరిగిందని తెలిపారు. రోజుకు కొత్తగా 3,000 నుంచి 3,50,000కు సైన్‌అప్ చేసే వినియోగదారుల సంఖ్య పెరిగిందని ఆయన వివరించారు. 

Advertisment
తాజా కథనాలు