జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడిపై అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ సాగుతోంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishore) ఇటీవల చంద్రబాబును కలవడం ఈ చిచ్చుకు కారణమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తనకు సమచారం ఇవ్వకపోవడంతో పవన్ (Pawan Kalyan) అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. పీకే చంద్రబాబును (Chandrababu) కలిసిన సమయంలో పవన్ కల్యాణ్ విజయవాడలోనే ఉన్నారు. దీంతో తనను సంప్రదించకుండా పీకేతో సంప్రదింపులపై ఆయన నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై పార్టీ నేతలు, సన్నిహితుల వద్ద పవన్ కల్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Lokesh: పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. లోకేష్ ట్వీట్!
జనసేనను లైట్ తీసుకుంటే పొత్తుపై కూడా సమీక్షించుకోవాల్సి ఉంటుందని కూడా పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇస్తున్నట్లు సాగుతున్న ప్రచారం ఇరు పార్టీల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. జనసేనకు సంబంధించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చంద్రబాబుతో చెబుతున్నప్పుడు.. పీకేతో సంప్రదింపుల విషయమై తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏంటని పవన్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలా రెస్పాండ్ అవుతారనే అంశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ గ్యాప్ ఇలానే కొనసాగితే పొత్తు ప్రశ్నార్థకంగా మరే ప్రమాదం ఉందని ఇరు పార్టీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.