Hyderabad: ప్రేమ జంటలే టార్గెట్..రెచ్చిపోతున్న పోకీరీలు బెదిరించి డబ్బు వసూళ్ళు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు పోకిరీలు. ఉప్పల్ భగాయత్లో ఓ ప్రేమజంటను బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేశారు. పోకిరీల్లో స్థానిక కార్పొరేటర్ తమ్ముడు ఉన్నట్టు అనుమానం. By Manogna alamuru 23 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Uppal: ఉప్పల్ భగాయత్లో పోకిరీల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. రాత్రివేళ భగాయత్కు వచ్చే జంటలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందుతులను శిక్షించాల్సిన ఎస్సై వారికే మద్దతు తెలపడంతో ఉన్నతాధికారులు అతడిని డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. రాత్రి వేళ భగాయత్లోకి వచ్చే జంటలను పోకిరీలు బెదిరిస్తున్నారు. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రేమజంట ఉప్పల్ భగాయత్కు వెళ్లారు. వారిని చూసిన పోకిరీలు రెచ్చిపోయారు. రూ.3 లక్షలు ఇవ్వాలని.. లేదంటే మీ వ్యవహారం బయటపెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు స్థానిక ఎస్సైను కలిసి పోకిరీలపై ఫిర్యాదు చేశారు. అయితే నిందితులతో చేతులు కలిపిన ఎస్సై కాంప్రమైజ్ కావాలంటూ ప్రేమికులను డిమాండ్ చేశారు. దీనిపై వారు ఉన్నతాధికారులను కలిసి విషయాన్ని వివరించారు. ఘటనపై వారు విచారణకు ఆదేశించారు. ఘటనపై ఆగ్రహించిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నలుగురు పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైను డీసీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19న ఐదుగురు నిందితులు అమర్, మారుతీ, ఉదయ్, రామ్ చరణ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. కాగా పట్టుబడిన నిందితుల్లో స్థానిక కార్పొరేటర్ తమ్ముడు ఉన్నట్లు సమాచారం. Also Read:Hyderabad: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. స్నాచింగ్ ముఠాపై పోలీసుల ఫైరింగ్ #hyderabad #robbery #couple #uppal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి