Andhra Pradesh : ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర... పొంగిన వాగులు... నిలిచిన రాకపోకలు!
ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Vijayanagaram: ఏపీలో దారుణం.. వాగులో కొట్టుకుపోయిన టీచర్లు!
ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లు కొండ వాగులో కొట్టుకుపోయిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. హరియాణాకు చెందిన మహేష్, ఆర్తి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ కొండవాగులో కొట్టుకుపోయారు. ఆర్తి చనిపోగా మహేష్ గల్లంతయ్యారు. వాగు దాటొద్దని చెప్పినా వినలేదని స్థానికులు తెలిపారు.
AP: చిట్టీల పేరుతో భారీ మోసం.. RTVతో బాధితుల ఆవేదన..!
విజయనగరం జిల్లాలో చిట్టీల పేరుతో కొందరు అమాయకులు మోసపోయారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే వీధిలో 20 ఏళ్లుగా నివసిస్తున్న ఓ వ్యక్తి ఏకంగా రూ. 3 కోట్లు నమ్మించి మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
AP: ప్రత్యేక దృష్టి దీనిపైనే: ఎస్పీ వకీల్ జిందాల్
విజయనగరం ఎస్పీగా వకీల్ జిందాల్ ఐపీఎస్ బాధ్యతలు చేపట్టారు. గంజాయి నిర్మూలన దిశగా ఎక్కువగా దృష్టి పెడతామన్నారు. సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. జిల్లాకి మంచి పేరు వచ్చేలా పోలీస్ సర్వీస్ అందిస్తామన్నారు.
AP: విద్యార్థి సంఘాల ఆందోళన.. NTAను రద్దు చేయాలని డిమాండ్.!
విజయనగరం జిల్లాలో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేశారు. అసమర్థంగా పరీక్షలు నిర్వహించిన NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టారు.
AP: పక్షవాతం.. దశాబ్దం గడుస్తున్న పెన్షన్ కి నోచుకోని అభాగ్యుడు..!
విజయనగరం జిల్లా పాతరేగ గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత 12 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన కనీసం పెన్షన్ రావడం లేదని ..పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకునే నాధుడు లేడని వాపోతున్నారు.
Vizianagaram: యూట్యూబ్లో చూసి భార్యను హత్య చేసిన జవాన్
AP: విజయనగరం జిల్లాలో జవాన్ దారుణానికి పాల్పడ్డాడు. యూట్యూబ్ లో చూసి భార్య హత్య చేశాడు. భార్యపై అనుమానంతో పెళ్లయిన 3 నెలలకు చంపేశాడు. ఈ నేరాన్ని భార్య పాత ప్రియుడుపై మోపాలని ప్రయత్నించాడు. ఈ కేసును చేజించి.. భర్త జగదీష్ను అరెస్ట్ చేశారు పోలీసులు.
AP: అస్తవ్యస్తంగా జగనన్న కాలనీ.. ఆవేదన వ్యక్తం చేస్తోన్న బాధితులు..!
విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీ అస్తవ్యస్తంగా మారింది. 90% ఇల్లు నిర్మాణం దశలోనే ఉన్నాయని.. కాలనీలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవని స్థానిక బాధితులు వాపోతున్నారు. నిర్మాణానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-106.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vzm-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vzm-sp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vzm-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/man-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Vizianagaram.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/jagan-7-1.jpg)