Vikarabad: కరెంట్ షాక్ కొడుతున్న స్కూల్.. హడలిపోయిన విద్యార్థులు!
వికారాబాద్ జిల్లా హస్నాబాద్ ప్రభుత్వ పాఠశాల భవనాలు షాక్ కొట్టడం కలకలంరేపుతోంది. బోర్డు, గోడలు, కిటికీలు, తలుపులకు షాక్ రావడంతో విద్యార్థులు హడలిపోయారు. 80 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం వర్షాలకు తడవటంవల్లే ఇలా జరిగిందని ప్రధానోపాధ్యాయుడు నర్సింలు తెలిపారు.