Vande Bharat : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు..!!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనున్నాయి. నరసాపురం నుంచి బెంగళూరు మధ్య త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు నడిపే ప్రతిపాదన ఉన్నట్టు విజయవాడ డీఆర్ఎం నరేంద్ర పాటిల్ వెల్లడించారు.కాగా, ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పలు వందే భారత్ రైళ్లు (సిట్టింగ్) నడుస్తుండడం, వాటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడం చూస్తునే ఉన్నాం.