మిథున్ రెడ్డిVSగల్లా జయదేవ్...మరీ ఇంతలా కొట్టుకోవాలా?
చంద్రబాబు అరెస్ట్ మీద ఆంధ్రా ఎంపీలు మాటల యుద్ధం చేసుకున్నారు. అది అక్కడతో ఆగకుండా తరువాత ట్విట్టర్ కు కూడా పాకి చిలిక చిలికి గాలివాన అయింది. బాడీషేమింగ్, వ్యక్తిగత దూషణ స్థాయికి దిగజారింది.
చంద్రబాబు అరెస్ట్ మీద ఆంధ్రా ఎంపీలు మాటల యుద్ధం చేసుకున్నారు. అది అక్కడతో ఆగకుండా తరువాత ట్విట్టర్ కు కూడా పాకి చిలిక చిలికి గాలివాన అయింది. బాడీషేమింగ్, వ్యక్తిగత దూషణ స్థాయికి దిగజారింది.
టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల మీద ఆయన ట్వీట్ చేశారు. రాబందుల రాజ్యమొస్తే రైతు బంధు రద్దవడం గ్యారెంటీ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ఆరు పథకాల మీద మండిపడ్డారు.
ఇద్దరు పెద్ద యాక్టర్లు మాట్లాడుకుంటే భలే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ మధ్య జరిగిన చిట్ చాట్ గురించి సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారు నెటిజన్లు. మీ సినిమా అదిరిపోయింది అని ఒకరంటే...మీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాని మరొకరు అంటున్నారు.
చంద్రయాన్ 3 మీద ట్వీట్ చేసి ట్రోలింగ్ కు గురయ్యారు నటుడు ప్రకాశ్ రాజ్. రెండు రోజుల నుంచి ఆయనను నెటిజన్లు ఏకిపారేస్తున్నప్పటికీ ఆయన మాత్రం తగ్గేదేలే అంటూ ఇంకా రెచ్చిపోతున్నారు. తన మీద వచ్చిన ట్రోలింగ్స్ కు గట్టిగా సమాధానం చెబుతున్నారు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని సొంతం చేసుకున్న దగ్గరి నుంచి రోజుకో మార్పులతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే బ్లూటిక్ సబ్స్క్రిప్షన్, ట్విట్టర్ పేరును ఎక్స్గా మార్చడం, లోగోలు మార్చడం వంటి వాటితో వార్తల్లో నిలిచారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం పై విజయసాయి రెడ్డి స్పందించారు.
ఓ కళాకారుడు మండపాన్ని తయారు చేసిన విధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే. తన అద్బుత సృష్టితో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా చేసిన విధానం అందరిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్గా ఉండే మంత్రి కేటీఆర్ వరకు తీసుకెళ్లింది. అంతటితో ఆగకుండా కళాకారుడు సూట్కేసులో పట్టేలా మండపాన్ని తయారుచేసిన ఈ వీడియోను మంత్రి కేటీఆర్ సోషల్మీడియాలో షేర్ చేశారు.
సోషల్ మీడియాలో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ పోటీ నడుస్తోంది. ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోడీ కన్నా రాహుల్ గాంధీ వీడియోలనే ఎక్కువ మంది చూశారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ, మోడీ ప్రసంగాల వీడియోలకు వచ్చిన వ్యూవ్స్ ను ఎక్స్ ప్లాట్ ఫారమ్(గతంలో ట్విట్టర్) షేర్ చేసింది. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫారమ్స్ లో మోడీ కన్నా రాహుల్ గాంధీకి ఎక్కువ వ్యూవ్స్ వచ్చాయని పేర్కొంది.
కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది. ఈ పోరు ఈసారి కాస్త భిన్నంగా ఉంది. కారణం ఏంటంటే..రెండు పార్టీల మధ్య తమ నాయకులకు అంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉన్న పాపులారిటీ గురించి సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. అయితే రెండు పార్టీలు వారి స్వంత వాదనలు వినిపిస్తున్నాయి. మా నాయకుడికి ఎక్కువ పాపులారిటీ ఉందని కాంగ్రెస్ వాధిస్తుంటే...లేదు..మా నాయకుడికే ఫుల్ పాపులారిటీ ఉందంటూ బీజేపీ అంటోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య రచ్చ సోషల్ మీడియాను కుదిపేస్తోంది.