నేడు చంద్రమోహన్ అంత్యక్రియలు.. అంతిమయాత్ర రూట్ ఇదే
ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్ నగర్లోని తమ ఇంటి నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
NARA LOKESH:నేడు రాజమండ్రికి వెళ్ళనున్న లోకేష్
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈరోజు రామండ్రికి వెళ్ళనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న లోకేష్ ఈరోజు ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గంలో లోకేష్ రాజమండ్రి బయలుదేరనున్నారు. సాయంత్రం జైలులో చంద్రబాబుతో అతను ములాకత్ కానున్నారు.
world cup 2023:చూసినోళ్ళకు చూసినంత...క్రికెట్ పండగ మొదలవుతోంది.
వన్డే వరల్డ్ కప్ కు అంతా సిద్ధమయింది. ఈరోజే క్రికెట్ పండగకు మొదటిరోజు. భారత్లో జరిగే ప్రపంచ సమరం ముంగిట్లోకి వచ్చేసింది. క్రికెట్ ఫ్యాన్స్ కు దాదాపు నెలన్నర రోజులు పండగే పండగ. పసందైన షాట్లు.. అదిరిపోయే సిక్స్ లు, బౌండరీ లైన్ దాటే బంతులు, అద్భుతమైన క్యాచ్ లు, క్లీన్ బౌల్డ్, డకౌట్ లు, సెంచరీలు...ఓహ్..ఇలా ఒకటేమిటి చూసినోళ్లకు చూసినంత, ఎంజాయ్ చేసేవాళ్ళకు కావల్సినంత సంబరం.
Skanda Movie Review:యాక్షన్ డ్రామాలో రామ్ సెట్ అయ్యాడా? స్కంద మూవీ రివ్యూ.
రామ్ పోతినేని...ఇంతకు ముందు యాక్షన్ మూవీస్ చేసినా మరీ ఇంత ఫుల్ లెంగ్త్ యాక్షన్ హీరోగా ఎప్పుడూ కనిపించలేదు. ఇంత వైలెంట్ గా అస్సలు కనిపించలేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన స్కంద మూవీలో రామ్ తనలోని మాస్ యాంగిల్ను మొట్టమొదటిసారి బయటకు తీశాడు. మరి బోయపాటి, రామ్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా లేదా...ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? స్కంద మూవీ రివ్యూ.
Chandrababu Quash Petition: నేడు హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ
ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. అలాగే నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో బెయిల్ మంజూరు కోసం వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది.
Yarlagadda meets Chandrababu Naidu: చంద్రబాబును కలిసిన యార్లగడ్డ వెంకట్రావు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో గన్నవరం సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు కాసేపట్లో భేటీ కానున్నారు. దీంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీ కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు యార్లగడ్డ వెంకట్రావు. ఈ నెల 22వ తేదీన గన్నవరంలో యార్లగడ్డ పసుపు కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ 'వందే భారత్' రద్దు.. ప్రయాణికుల అసంతృప్తి
విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ రద్దు అయ్యింది. టెక్నికల్ రీజన్స్ తో ఈ రైలును గురువారం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన చేశారు. ఆగష్టు 17 ఉదయం 5.45కి ఈ రైలు బయలు దేరాల్సి ఉంది. ఈ రైలు ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 7 గంటలకు బయలు దేరింది. ఈ రైలు కేవలం వందే భారత్ స్టాపుల్లో మాత్రమే ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు ఏవైనా అనుమానాలు ఉంటే .. వెంటనే ఆయన రైల్వే స్టేషన్ లలో రైల్వే శాఖ అధికారులను వివరాలను అడిగి తెలుసుకోవాలని సూచించింది విశాఖ రైల్వే శాఖ.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-45-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/23-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/w2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/skanda-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/naidu1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet1-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-2-3-jpg.webp)