Terrorists: దేశ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం..
పాకిస్థాన్ నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సరిహద్దు అవతలి నుంచి చొరబాటుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదుల్ని కాల్చేశాయి. పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్తో ముష్కరుల కుట్రను భగ్నం చేశారు. ఇందులో హతమైన ఉగ్రవాదులకు లష్కరే తోయిబా అనే ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.