ఆర్జీవీ ఇంటి వద్ద హై టెన్షన్! | Ram Gopal Varma Arrest News Hyderabad Telangana | RTV
తెలంగాణలో పోలింగ్ భారీగా నమోదైంది. గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. అయితే, పెరిగిన పోలింగ్ శాతం తమకే మేలు చేస్తుందని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వాదిస్తున్నాయి. ఫలితం ఏంటనేది తేలాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ సర్వే సంస్థలు ప్రీ పోల్ సర్వే రిపోర్ట్స్ను వెల్లడించాయి. మెజార్టీ సంస్థలు బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెబుతున్నారు. కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని కొన్ని సంస్థలు చెబుతున్నారు. అధికారం ఏ పార్టీదో తేలాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.
ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ.. సంతోష్ నగర్ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం ముగుస్తోందని సీఐ వారించగా.. తనకే వార్నింగ్ ఇస్తావా? అంటూ రెచ్చిపోయారు. తనను ఆపే వాడు ఇంకా పుట్టలేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. రెడ్డి ల్యాబ్ డైరెక్టర్ కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 7.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్నికల కోసమే వీటిని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు అధికారులు.
హయత్నగర్లో అర్థరాత్రి అలజడి రేగింది. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గెస్ట్ హౌస్లో తనిఖీలు చేశారు పోలీసులు. సోదాల్లో రూ. 5.5 లక్షల నగదును గుర్తించి సీజ్ చేశారు. లెక్కలు చెప్పాలని మధుయాష్కిని కోరారు. ఇది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనే అని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
తెలంగాణలో ఎన్నికల పండుగ ఎఫెక్ట్ కారణంగా మద్యం విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. రోజుకు రూ. 188 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇది రూ. 200 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు 4 శాతం మద్యం విక్రయాలు పెరగగా.. బీర్ల విక్రయాలు మాత్రం ఏకంగా 13 శాతం పెరిగాయి. దసరా, దీపావళి పండుగలు, అసెంబ్లీ ఎన్నికలే మద్యం విక్రయాల పెరుగుదలకు కారణం అని భావిస్తున్నారు అధికారులు.