Telangana: కాళేశ్వరంలో రూ.50వేల కోట్లకు పైగా అవినీతి.. ఆ కాంట్రాక్టర్లు తిన్నది కక్కిస్తాం: మంత్రులు
కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ మంత్రులు. ప్రాజెక్టులో దాదాపు రూ. 50 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని స్పష్టం చేశారు. ప్రాజెక్టును కట్టిన వారే బాధ్యులు అని హెచ్చరించారు.