Ranganayaka Sagar Incident | సాగర్లో పడి నలుగురు | Siddipet District | RTV
కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైపోయిందని, అందుకే ఈ రోజు రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తున్నది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రకు హరీష్ రావు హాజరయ్యారు.
ఆడవారంటేనే అమ్మ మనసు అంటారు. ఆ అమ్మ మనసు మనుషులపైనా, పక్షులపైనా. జంతువులపైనా ఒకేలా చూపిస్తుంది. ఆకలితో ఉన్నబిడ్డలు తినకుంటే ఆ అమ్మ మనసు నొచ్చుకుంటుంది. ఓ మహిళ పక్షుల ఆకలిని అర్థం చేసుకుంది. తల్లి'తనంతో ఆలోచించి పక్షుల కోసం సాగు చేసిన పంటనే త్యాగం చేసింది.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదని బీజేపీ నాయకులు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఆరోపించారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లికూతుళ్లతో పాటు ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన అత్తాకోడళ్లు ప్రాణాలు కోల్పోయారు.
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలీ పనులు చేసుకుంటనే నాలుగు వేళ్లు నోట్లోకి పోయేది. దీనికి తోడు నలుగురు పిల్లల పోషణ మరింత భారంగా మారింది. దీంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏటీఎం ద్వారా కూడా ఈపీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. హైదరాబాద్ లో ఈపీఎఫ్ఓ కార్యాలయాలను మాండవీయ ప్రారంభించారు.
చికెన్ తింటే ఎలాంటి హాని లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హరీష్ రావు. చికెన్ తింటే బ్లర్డ్ ఫ్లూ వస్తుందంటూ సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దన్నారు. సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ & ఎగ్ మేళాలో పాల్గొన్నారు
సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరిస్తుండగా పోల్ కరెంట్ తీగలకు తగిలింది. ఈ ప్రమాదంలో లింగ ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 13 మందికి తీవ్ర గాయాలైయ్యాయి.