Rahul Gandhi : సత్యపాల్ మాలిక్తో రాహుల్...పుల్వామా దాడులు, అదానీ గురించి చర్చించా..!!
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానంపై ప్రశ్నలు సంధించారు. సెక్షన్ 370ని తొలగించిన తర్వాత అక్కడి పరిస్థితులను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. బీజేపీ నియమించిన గవర్నర్ గా పనిచేసిన సత్యపాల్ మాలిక్, పదవీ విరమణ అనంతరం బీజేపీ అగ్రనాయకత్వంపై..మోదీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.