Doordarshan : కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు..
ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ న్యూస్ ఛానల్ లోగో మారింది. గతంలో ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా.. తాజాగా దీన్ని కాషాయ రంగులోకి మార్చేశారు. అయితే దీన్ని బీజేపీ జెండా రంగులోకి మార్చడంతో విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.