Rythu Bandhu: వారికే రైతుబంధు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
రైతు బంధుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకే రైతు బంధు సాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భూమిని సాగు చేసే వారికే రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.