ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి!
రాజస్థాన్ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సభకు భద్రత కోసం వెళ్తున్న పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా ..ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
రాజస్థాన్ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సభకు భద్రత కోసం వెళ్తున్న పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా ..ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు, బైక్ను ఢీ కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాయపర్తి మండలం కిష్టాపురం క్రాస్ రోడ్డులో తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
యమునా ఎక్స్ప్రెస్ పై కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో..కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఎక్స్ప్రెస్ వే పై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మహారాష్ట్ర (Maharashtra) లోని పూణే (Pune) లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. కంటైనర్ ను ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ దారుణ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జుయ్యింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. పిల్లలకు ఏమైనా జరుగుతుందేమో అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా ఆస్పత్రి దగ్గర చేరుకున్నారు.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- ఆటో రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో ఆరుగరికి గాయాలయ్యాయి.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఓ యువతి నిండు ప్రాణాం బలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వీ.సీ సజ్జనార్ ఐపీఎస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్..అమ్మో రోడ్డుపై నడవాలంటేనే భయం వేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఎంపీ మార్గాని భరత్ మానవత్వం చాటుకున్నాడు. భరత్ రాజమండ్రికి వెళ్తున్న సమయంలో అతని కన్వాయ్ రాజమండ్రి గ్యామన్ ఇండియా బ్రిడ్జి మీదకు రాగానే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ను ఢీ కొట్టడంతో బైక్పై వెళ్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా. అందులో ఒకరు మృతి చెందారు.