Varanasi: మూడు దశాబ్దాల తర్వాత జ్ఞానవాపిలో హిందువుల పూజలు
జ్ఞానవాపిలో హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది వారణాసి కోర్టు. పూజలను వారం రోజుల్లో ప్రారంభిస్తామని కోర్టుకు తెలియజేసింది కాశీవిశ్వనాథ ట్రస్ట్. దీంతో 30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో స్థానిక పూజారి కుటుంబం గురువారం పూజలు నిర్వహించింది.