Sharmila : రామోజీరావుకు వైఎస్ షర్మిల నివాళి..!
రామోజీరావుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు సతీమణి రమాదేవిని, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.