ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్ లో విచారణకు రావాలని ఆదేశించారు. అనారోగ్యం కారణంగా రాలేనని లింగయ్య చెప్పినట్లు సమాచారం.