కేజ్రీవాల్ కు చుక్కెదురు.... హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమన్న సుప్రీం కోర్టు...!
సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. గుజరాత్ వర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ కేసు ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు ఎదుట పెండింగ్ లో వుందన్నారు. అందువల్ల ఇప్పుడు స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఏమైనా సమస్యలు వుంటే గుజరాత్ హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించింది.