Olympics 2024 : గురి చూసి కొడితే గోల్డ్ వచ్చి పడాల్సిందే..!
పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ నుంచి అత్యధికంగా 21 మంది షూటర్లు అర్హత సాధించారు. ప్రతి మెడల్ ఈవెంట్లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం షూటర్లకు తొలి పరీక్ష ఎదురుకానుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మెడల్ ఈవెంట్ ఉంది.