Nyjah Huston: వారానికే రంగు పోయింది.. ఒలింపిక్ పతకాలపై అథ్లెట్ పోస్ట్ వైరల్!
పారిస్ ఒలింపిక్స్ నిర్వహణ తీరు మరోసారి వివాదాస్పదమైంది. వారం రోజులకే పతకాల రంగు పోయిందంటూ అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఒలింపిక్స్ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుని, పతకాలు రీప్లేస్ చేస్తామంటున్నారు.