Hyderabad: ఓయూలో నీళ్ల కష్టాలు.. హాస్టల్స్ మూసివేతపై విద్యార్థుల ఆందోళన!
ఓయూలో హాస్టల్స్ మూతివేత అంశం మరోసారి ఆందోళనలకు దారితీసింది. నీటి ఎద్దడి, కరెంటు కోత కారణంగా విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు వార్డెన్ నోటీసు జారీ చేశారు. మే 14 నుంచి జూన్ 6 వరకూ మెస్, హాస్టల్ క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.