భారత్ సెక్యూలర్ దేశంగా ఉండొద్దని కోరుతున్నారా ?.. పిటిషినర్లకు సుప్రీం చురకలు
రాజ్యాంగం పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలను తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(PIL) విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియా లౌకిక దేశంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా ? అంటూ ప్రశ్నించింది.