Crime: ఆర్టీసీ బస్సు ఢీ.. ప్రభుత్వ ఉద్యోగి మృతి!
ఆర్టీసీ బస్సు ఢీ కొని ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం చెందాడు. కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా పనిచేస్తున్న సింగరి నరేష్ బైక్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో నకిరేకల్ వద్ద బస్సు టైర్ల కిందపడి మరణించాడు. ఓవర్ టెక్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.