చావమంటే చస్తాం కానీ..| Musi River Victims Emotional | HYDRA | CM Revanth Reddy | RTV
మూసీ కూల్చివేతలను పరిశీలించడంతో పాటు నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్ ను అంబర్పేట, ముషీరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పాత బస్తీలో మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలను హైడ్రా అధికారులు ప్రారంభించారు. బస్తీలోని వారిని ముందే ఖాళీ చేయించి డబుల్ రూమ్ ఇళ్లకు తరలించారు. జేసీబీ బస్తీల్లోకి వెళ్లలేకపోవడంతో భారీ పోలీసుల భద్రత నడుమ అధికారులు కూల్చివేతలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మూసీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస వసతులు కూడా లేవంటూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వసతులతోపాటు ఉపాధి కల్పించాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.
మూసీ కూల్చివేతలపై రేవంత్ సర్కార్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. వివాదాలకు పోకుండా సాధ్యమైనంత సామరస్యంగా నిర్వాసితులను ఒప్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం.
TG: మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన చేశారు. మూసీలో సర్వేకు, హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మూసీలో కూల్చివేతలు ఉంటాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీలో ఇప్పటి వరకు ఎవరికీ హైడ్రా నోటీసులు ఇవ్వలేదన్నారు.
హైదరాబాద్లో మసీ నది సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ రివర్బెడ్ ఏరియాలో 2,166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి కూల్చివేతల బాధ్యతను కూడా ప్రభుత్వం హైడ్రాకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
TG: మూసీలో అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర సర్కార్ యాక్షన్ మొదలు పెట్టింది. కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది. రివర్బెడ్లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసింది.
మూసీ నది ప్రక్షాళనకు అడుగులు ముందుకు పడుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ వద్ద మూసీ నదిపై ఉన్న నిర్మాణాలను ఆర్డీవో అధికారులు పరిశీలించారు. అక్కడి నివాసాలు, దుకాణాల పర్మిషన్ల వివరాలు సేకరిస్తున్నారు.