MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు
ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఐటీ అధికారులతో కలిసి సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి 10 మంది ఈడీ అధికారుల బృందం ఆమె నివాసం తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఐటీ అధికారులతో కలిసి సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి 10 మంది ఈడీ అధికారుల బృందం ఆమె నివాసం తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
యాదాద్రిలో ఉపముఖ్యమంత్రి భట్టిపట్ల సీఎం రేవంత్ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సీఎం ఎత్తైన పీటలమీద కూర్చొని భట్టిని తక్కువ ఎత్తులో కూర్చోబెట్టడం చాలా దౌర్భాగ్యం. వెంటనే రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 26న విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ. లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో హైదరాబాద్ కు వచ్చి కవిత వద్ద స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేసుకున్న విషయం తెలిసిందే.
ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. పూర్తిస్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం ఇలాంటి అనేక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోతుందని మండిపడ్డారు.
TSPSC చైర్మన్గా తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నియమించడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
లిక్కర్ స్కాంలో ఇరికి ప్రజల సొమ్మును దొచుకోలేదా? అని కవితను ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. లిక్కర్ రాణిగా కవిత పేరు పొందారని.. బీజేపీ కాళ్ళు మొక్కి ఈ కేసు నుంచి తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో కవిత ఎక్కడ పోటీ చేసిన ఓడిపోతుందని అన్నారు.
ఇంద్రవెల్లి సభలో మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్కు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చినట్లుంది.. అందుకే ఈ ఆరోపణలు చేశారని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్కు సినిమా చూపిస్తామని అన్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై పోలీసులు జట్టు పట్టుకుని దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇది హేయమైన చర్య అని, సంఘటన తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు.