Big Breaking : రెండు ముక్కలు కాబోతున్న హైదరాబాద్ | Hyderabad GHMC | CM Revanth Reddy | RTV
పన్నెండేళ్ల మోదీ పాలనపై, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. BJP నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రండి.. BRS నుంచి KCR లేదా ఆయన కొడుకు, అల్లుడిని ఎవరిని పంపించినా పర్వాలేదన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రణాళికా సిద్ధం చేశామని సీఎం రేవంత్ అన్నారు. ఇందులో భాగంగానే నారాయణపేట జిల్లా అప్పక్ పల్లిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగు నీరు, సాగునీరు అందించేందుకు కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారని ఇప్పుడు ఏసీ రూముల్లో నుంచి బయటకు రావడం లేదని సీఎం రేవంత్ అన్నారు . హైదరాబాద్లో ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి- మెమైర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రధాని మోదీ బీసీ కాదనే చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. ప్రధానిని తాను వ్యక్తిగతంగా తిట్టలేదని.. పుట్టకతో ఆయన బీసీ కాదని మాత్రమే చెప్పానని తెలిపారు. తన మాటలను కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని విమర్శించారు.
ప్రధానీ మోదీ కులం గురించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మండిపడ్డారు. రేవంత్ ఖబర్దార్ ప్రధానిపై తప్పుడు వ్యాక్యాలు చేస్తే చరిత్ర హినుడిగా మిగిలిపోతావంటూ హెచ్చరించారు. పదవిని కాపాడుకొనేందుకు ఇలా మాట్లాడుతున్నారన్నారు.