Maoists Encounter: నిన్న జగన్.. ఇవాళ లచ్చన్న... మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తుపాకీ మోత మోగింది. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వారిలో పాల్వంచ - మణుగూరు- కరకగూడెం డీవీసీఎం లచ్చన్న హతమైనట్లు అధికారులు తెలిపారు.
Nursing Student : RTV చేతిలో కారుణ్య డెత్ ఎఫ్ఐఆర్.. తల్లి బయటపెట్టిన నిజాలివే!
భద్రాధ్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం మారుతి కళాశాల నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారుణ్య తండ్రి గురుమూర్తి ఫిర్యాదుతో సెక్షన్ 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కారుణ్యది హత్యేనని బాధితురాలి తల్లి ఆరోపిస్తుంది.
Kothagudem: నర్సింగ్ స్టూడెంట్ సూసైడ్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!
మిస్టరిగానే మిగిలిపోయిన నర్సింగ్ స్టూడెంట్ కారుణ్య సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూసైడ్ లేఖలో సున్నితమైన అంశాలున్నాయనే కారణంగా లేఖను బహిర్గతం చేయట్లేదని పోలీసులు చెబుతున్నారు. తోటి విద్యార్థుల వేధింపుల కారణంగానే కారణ్య చనిపోయారని ప్రచారం జరుగుతోంది.
Kothagudem : లక్ష రూపాయల లంచం.. ఏసీబీకీ అడ్డంగా బుక్కైన ట్రాన్స్ కో ఏఈ!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి ఆఫీసర్ అడ్డంగా బుక్కయ్యాడు. అశ్వారావుపేట ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్ మద్దికొండ గ్రామ రైతు దగ్గర లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
CM Revanth Reddy : కొత్తగూడెంలో రేవంత్ మీటింగ్.. జిల్లాల రద్దుపై ప్రకటన: LIVE
సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కొత్తగూడెంలో నిర్వహించనున్న పార్టీ ప్రచార సభలో పాల్గొంటున్నారు. కొత్త జిల్లాలను కాంగ్రెస్ రద్దు చేయనుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఈ సభలో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వనున్నారు. రేవంత్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
Crime: విద్యార్థినిలతో ఉపాధ్యాయుడి రాసలీలలు.. కీచకుడికి విద్యాశాఖ మద్ధతు!
తెలంగాణలో మరో కీచక టీచర్ ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు హైస్కూల్ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన సీతారామయ్యపై కేసు నమోదైంది. దీనిపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
కొత్తగూడెంలో హైటెన్షన్.. ఏఐటీయూసీ, సీఐటీయూ నేతల మధ్య వాగ్వాదం
సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ, సీఐటీయూ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సాంబశివరావును ప్రధాన కార్యాలయంలోకి అనుమతించపోవడంతో ఏఐటీయూసీ కార్మికులు నిరసన చేపట్టి నినాదాలు చేశారు.