Delhi : ఢిల్లీ బోరు బావిలో పడింది చిన్నారి కాదు..20 ఏళ్ళ యువకుడు
ఢిల్లీలోని కేశోపూర్ మండి దగ్గరలోని వాటర్ బోర్డు ప్లాంట్ బోరు బావిలో పడింది చిన్నారి కాదు...20 ఏళ్ళ యువకుడు అని చెబుతున్నారు. అర్థరాత్రి దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడు బోరుబావిలో పడిపోయాడు. ఇప్పటివరకు అందరూ ఆ బోరు బావిలో పడింది చిన్నారి అనే అనుకున్నారు.