Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ రాజకీయ దుమారం.. అసలేం జరుగుతోంది?
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ మంగళవారం బ్యారేజ్ ను పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద ఏర్పడ్డ పగుళ్లను పరిశీలించిన బృందం సభ్యులు.. ఇందుకు గల కారణాలు ఏంటనే అంశంపై దృష్టి సారించారు. బ్యారేజ్ పటిష్ఠత, జరిగిన నష్టంపై ఈ కమిటీ అంచనా వేసినట్లు తెలుస్తోంది. బ్యారేజీకి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.