DSP About Kakinada Road Accident | లారీ డ్రైవర్ తప్పే | Car Hits Lorry | RTV
కాకినాడ జిల్లా తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. రాజమండ్రి అపోలో ఫార్మసీకి చెందిన ఉద్యోగులు మృతి చెందినట్లు గుర్తించారు.
ఏపీ కాకినాడలో ఘోరం జరిగింది. రామారావుపేట కాలేజీలో కంప్యూటర్ టీచర్గా పనిచేస్తున్న వివాహిత.. స్టూడెంట్ మణికంఠతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె భర్త లక్ష్మణ్ పక్కా సమాచారంతో వారు ఇంట్లో సన్నిహితంగా ఉండగా పోలీసులతో కలిసి పట్టుకుని చితకబాదాడు.
కాకినాడ జిల్లా పిఠాపురం చేబ్రోలు బైపాస్ రోడ్ లో 2నెలలు క్రితం గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతుడు అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన తంగేళ్ళ లోవరాజు గా గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు.
నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ప్రతిపక్షంలో ఉండగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేశారంటూ శ్రీరెడ్డిపై టీడీపీ మహిళ నేతలు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు.
ఈ మధ్య కాలంలో గుడి బడి అని తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ సమీపంలోని సముద్ర తీర ప్రాంతమైన పి. అగ్రహార గ్రామ అమ్మవారి మెడలో మంగళ సూత్రాలు, తలపై కిరీటాన్ని సైతం దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బెట్టింగులకు బానిసై అప్పుల్లో కూరుకుపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగుల కారణంగా అయిన అప్పుల బాధ భరించలేక రమణబాబు తుని రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఉద్దండపురంలో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు.
ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.