ఫామ్ హౌస్ ఇష్యూ పై కేసీఆర్ సీరియస్
జన్వాడ పార్టీ కేసు ఎఫ్ ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 16 మంది మహిళలు, 22 మంది పురుషులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి యూరిన్ టెస్టులో కొకైన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
జన్వాడ ఫామ్హౌస్ ఇష్యూపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. రాజ్పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తున్నారంటూ డీజీపీకి ఫోన్ చేసి ఆరాతీశారు. వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కోరారు.
జన్వాడ ఫాంహౌస్ నిర్మాణానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి పర్మిషన్ లేదని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాలతో నాలా బఫర్జోన్లో ఫాంహౌస్ ఉందా ? లేదా ? అని నిర్ధారించాక రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.