AP : నేడే వారాహి విజయభేరి మోగించనున్న పవన్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నాలుగు రోజులు పిఠాపురంలోనే బస చేయనున్నారు. పురోహుతిక అమ్మవారిని దర్శించుకుని శక్తిపీఠంలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నాలుగు రోజులు పిఠాపురంలోనే బస చేయనున్నారు. పురోహుతిక అమ్మవారిని దర్శించుకుని శక్తిపీఠంలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఆయన ఇక్కడ నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 12వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు పోలవరం జనసేన అభ్యర్థి చిర్రిబాలరాజు. కూటమి విజయం సాధించడం ఖాయమంటున్న చిర్రి బాలరాజు ఆర్టీవీతో సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎంపీ, టీడీపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు భేటీ అయ్యారు. తిరుపతి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ సైతం ఈ రోజు మధ్యాహ్నం పవన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దే అంతిమ నిర్ణయం అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. పవన్ నిర్ణయం కాదని ఎవరైనా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు.
టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ గోపాల్ యాదవ్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అలాగే విజయవాడ, విశాఖపట్నం నుంచి పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైసీపీలో చేరారు.
కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ తనకు ఇవ్వకపోవడంతో.. జనసేన రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదని.. కాపులకే పెద్ద పీట వేశారని విమర్శించారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఉమ్మడి కడప జిల్లాలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు భార్యాబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. సుబ్బారావు కుటుంబం మరణించడం సందేహాలకు తావిస్తోందన్నారు. వైసీపీ నేతల భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పి. గన్నవరం సీటును జనసేనకు కేటాయించారు. తాజాగా జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పేరును ప్రకటించారు పవన్. తోలి జాబితాలో పి. గన్నవరం టికెట్ను రాజేష్కు చంద్రబాబు ఇచ్చిన విషయం తెలిసిందే.