TG News: తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ.. పేలుతున్న మాటల తూటాలు!
తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ పీక్స్కి చేరింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. జానారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. జానారెడ్డిని ధృతరాష్ట్రుడితో పోల్చారు రాజగోపాల్ రెడ్డి.