నైజర్ లోని భారత పౌరులకు భారత విదేశాంగ శాఖ కీలక సూచనలు..!
ఆఫ్రికాలోని నైజర్ దేశంలో వున్న భారత పౌరులకు భారత విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. నైజర్ లో నెలకొన్న తీవ్రమైన హింసాకాండ నేపథ్యంలో భారత పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని సూచనలు చేసింది. నైజర్ వెళ్లాలనుకునే భారతీయులు పునరాలోచించుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు.