/rtv/media/media_files/2025/01/14/icxN4ALtLKO6AnPWnAEU.jpg)
ntsjjsj Photograph: (ntsjjsj)
రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయ పౌరులను త్వరగా విడుదల చేయాలనే భారత్ మంగళవారం డిమాండ్ చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కేరళ యువకుడు మరణించాడు. టిబీ బినిల్(32 ) రష్యా సైన్యంలో విధులు నిర్వహిస్తూ రెండు రోజుల క్రితం మృతిచెందాడు. అతని సమీప బంధువు కూడా యుద్ధంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇండియాకు తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతుంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం తీవ్రతరం అవుతున్నందున రష్యా ఆర్మీలో పని చేస్తు్న్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి : రష్యాలో మరో భారతీయుడు మృతి
భారతీయ పౌరుడి మరణంపై స్పందించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రష్యా ఆర్మీలో పని చేస్తున్న ఇతర భారతీయులను విడుదల చేయాలనే డిమాండ్ను లేవనెత్తుతూ, యుద్ధంలో చనిపోయిన సైనికుడి మరణానికి తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ప్రకటన విడుదల చేశారు. రష్యన్ ఆర్మీలో పనిచేయడానికి రిక్రూట్ చేయబడిన కేరళకు చెందిన భారతీయడు దురదృష్టవశాత్తు మరణించాడని తెలిపారు. కేరళకు చెందిన మరో భారతీయుడు కూడా గాయపడ్డాడు. అతను మాస్కో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.