Hydra Commissioner Ranganath Visits Machabollaram | Alwal Graveyard | RTV
సోమవారం ఒక్కరోజే హైడ్రా ప్రజావాణికి 71కి పైగా ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వీటిని అక్కడికక్కడే అధికారులతో చర్చించి చర్యలకు ఆదేశించారు. కాలనీల చుట్టూ రహదారులను నిర్మించిన పక్షంలో వాటిని తొలగించాలని సూచించారు.
రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Telangana Congress Government Proposes to Introduce Anti Land Grabbing Act to bring transparency in the Land Titling| RTV
TG: హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు చెబుతూ బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు.
“బఫర్ జోన్ లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చేశాము. పేద, మధ్యతరగతికి చెందిన కట్టడాలపై ఇప్పుడు చర్యలు తీసుకోవడం లేదు. అటువంటి నిర్మాణాలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది.” అంటూ హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
హైడ్రా ఆధ్వర్యంలో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన కట్టడాలు అవి బడాబాబులు.. సెలబ్రిటీలు ఎవరికి చెందినవైనా సరే కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు ముప్పు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, ఆయన ఇంటి వద్ద పోలీసు భద్రత పెంచింది.