TG: ఎల్లుండి నుంచి అసలు సర్వే.. ఏ ఇళ్లు వదలొద్దు: సీఎస్ కీలక ఆదేశాలు
తెలంగాణలో నవంబర్ 9నుంచి అసలు కుటుంబ సమగ్ర సర్వే మొదలవుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చిత్త శుద్దితో కృషిచేయాలన్నారు. ఏ ఇంటినికూడా వదలకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.