Delhi: ఢిల్లీలో భారీ వర్షం..విమానాలు దారి మళ్ళింపు
భారీ వర్షం ఢిల్లీని మళ్ళీ ముంచెత్తింది. ఆగకుండా కురిసిన వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాలు వరద మయమయం అయ్యాయి. దీంతో రహదారులన్నీ నిండిపోయాయి. దాంతో పాటూ పలు విమానాలను కూడా దారి మళ్ళించారు.
భారీ వర్షం ఢిల్లీని మళ్ళీ ముంచెత్తింది. ఆగకుండా కురిసిన వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాలు వరద మయమయం అయ్యాయి. దీంతో రహదారులన్నీ నిండిపోయాయి. దాంతో పాటూ పలు విమానాలను కూడా దారి మళ్ళించారు.
ఢిల్లీలో పడిన భారీ వర్షానికి అక్కడ ఓ కోచింగ్ సెంటర్ మొత్తం నీటితో మునిగిపోయింది. దీంతో బిల్డింగ్ బేస్మెంట్లోకి విపరీతంగా నీరు చేరిపోయింది. ఈ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు.
ముషీరాబాద్ లోని రాంనగర్ లో ఓ వీధిలో వరద ఉదృతిలో కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రాయ్గఢ్ ఫోర్ట్ను సైతం వరదనీరు చుట్టుముట్టింది.ఫోర్ట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో సుమారు 30 మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు.
దక్షిణ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతిలో ఈరోజు భారీ వర్షం కురిసింది. దీంతో తిరుపతికి వచ్చిన పర్యాటకులు,యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి వాహనదారులు , పాదచారులు తిరగడానికి పాట్లు డుతున్నారు.
గోవాలో ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన టూరిస్టులు చిక్కుల్లో పడ్డారు. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నది నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో అక్కడికి వచ్చిన 80 మంది వరదల్లోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం రెస్యూ టీం వాళ్లని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది.
తెలంగాణ రాజధాని నగరంలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కోఠి, ఎల్బీనగర్, లక్డీకాపూల్, దిల్ సుఖ్ నగర్ లో భారీ వర్షం కురుస్తునే ఉంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది.
నాగర్కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. వనపట్లలో భారీవర్షానికి మట్టిమిద్దె కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. తల్లి గొడుగు పద్మ, ఇద్దరు కూతుళ్లు పప్పి, వసంత, కుమారుడు విక్కి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన తండ్రి భాస్కర్ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.