TG News: క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయండి.. సీజనల్ వ్యాధులపై సీఎం రేవంత్ ఆదేశాలు!
రాష్ట్రంలో భారీ సంఖ్యలో డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాల కేసులు పెరగడంపై సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని సూచించారు.