అటవీశాఖలో విలువైన కార్లు మాయం.. నివేదిక కోరిన పవన్!
ఏపీ అటవీశాఖ అధికారులకు పవన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన కార్లు మాయం కావడంపై ఆరాతీస్తున్నారు. అవి ఏమైపోయాయో వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్ ను ఆదేశించడం సంచలనం రేపుతోంది.