KCR: పార్టీ నుంచి వెళ్లిపోయేవారితో నష్టం లేదు.. కేసీఆర్
పార్టీ నుంచి వెళ్లిపోయేవారితో నష్టం ఏమి లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగబోయే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన సందర్భంగా వారికి దిశానిర్ధేశం చేశారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, ఎన్టీఆర్ లాంటి నేతకే తప్పలేదని గుర్తు చేశారు.