World Cup 2023:ఇండియా కప్ గెలవాలంటే..ఆ మొనగాడే ముఖ్యం
ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీని కోసం బీసీసీఐ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. అతిరథ మహారథుల మధ్య ఈ మ్యాచ్ను కన్నులపండువగా నిర్వహించడమే కాక... భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది.