Telangana elections:నేటి నుంచే పోస్టల్ ఓటుకు దరఖాస్తు..ఎవరెవరు చేసుకోవచ్చంటే..
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేయాలనుకునేవారు మాత్రం ఈరోజు నుంచి 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Supreme Court: ఏ పార్టీకి ఎన్ని విరాళాలొచ్చాయో చెప్పండి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం
ఎలక్షన్స్లో నగదు పాత్రను తగ్గించాల్సన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల బాండ్ల ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.
వాటే ఐడియా గురూ.. గాడిదపై వచ్చి నామినేషన్ వేశాడు..
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి గాడిదపై వెళ్లి నామినేషన్ వేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. దేశంలో వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఇలా గాడిదపై వచ్చి నామినేషన్ వేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
BJP first list:మరి కాసేపట్లో అధికారికంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటన
తెలంగాణ ఎన్నికల కోసం బీజెపీ తన మొదటి జాబితాను సిద్ధం చేసుకుంది. 55 మంది అభ్యర్ధులతో కూడిన ఈ లిస్ట్ కు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. మరికొంత సేపటిలో తొలి జాబితాను ప్రకటిస్తారని సమాచారం.
E Voter Card : ఇలా చేస్తే.. క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డు
ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఈ - ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ఓటు వేయవచ్చని తెలిపింది. దాన్ని ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. దాన్ని ఈజీగా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు కూడా. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో కీలక మార్పులు చేసినట్లు పేర్కొంది.
TELANGANA ELECTIONS:సమరానికి రెడీ అయిపోయిన బీఆర్ఎస్...రంగంలోకి కేసీఆర్
తెలంగాణలో అసెంబ్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో అన్ని పార్టీలు సమరానికి సై అంటున్నాయి. అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రచారంలోకి దిగిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
YCP :మార్చి-ఏప్రిల్లో ఎన్నికలు, ఫిబ్రవరిలో వైసీపీ మ్యానిఫెస్టో
ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. మార్చి ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని చెప్పారు ఆ పార్టీ అధినేత జగన్. అక్టోబర్ 25 నుంచి 31వ తేదీ వరకు ఏపీ సీఎం జగనన్న బస్సు యాత్ర ఉంటుందని ప్రకటించారు. దాంతో పాటూ జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమాలను ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం.
Lok Poll Survey: తెలంగాణలో ఆ పార్టీదే హవా అంటున్న లోక్ పోల్ సర్వే...రేవంత్ జిమ్మిక్కు అంటున్న దాసోజు
తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో సర్వేల సందడి మొదలైంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి? ఏ పార్టీ అధికారం చేజిక్కించుకోనుంది? అంటూ సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో అన్నింటికంటే ఢిపరెంట్ గా తెలంగాణలో కాంగ్రెస్ దే హవా అంటూ లోక్ పోల్ సర్వే చెబుతోంది. అందరికన్నా భిన్నంగా ఉండడంతో దీని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.